బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

కొరియర్‌ అంటూ ఇంట్లోకి.. పెప్పర్‌ స్ప్రేతో మంగళసూత్రం చోరీ!

కొరియర్‌ అంటూ ఇంట్లోకి.. పెప్పర్‌ స్ప్రేతో మంగళసూత్రం చోరీ!

ఒంటరిగా ఉన్న మహిళపై దాడి.. నాలుగు తులాల బంగారం అపహరణ

సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి జాడ పట్టిన మియాపూర్‌ పోలీసులు

ఏపీలోని కనిగిరిలో అరెస్టు.. మంగళసూత్రం స్వాధీనం

సైబరాబాద్, ఆగస్టు 5 (సిటీటైమ్స్): కొరియర్‌ డెలివరీ ఏజెంట్‌గా ఇంట్లోకి వచ్చాడు.. మహిళ ఒంటరిగా ఉందని నిర్ధారించుకున్నాడు.. ముఖంపై పెప్పర్‌ స్ప్రే చల్లి నాలుగు తులాల మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు. ఈ కేసును ఛేదించిన మియాపూర్‌ పోలీసులు నిందితుడిని ఏపీలోని ప్రకాశం జిల్లా కనిగిరిలో అరెస్టు చేశారు. అతడిని షేక్‌ ఖాజా అర్షల్‌ (20)గా గుర్తించారు.

జులై 31న ఆయుర్వేద మందులు డెలివరీ చేసేందుకు వచ్చినట్లు చెప్పి నిందితుడు ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ముఖంపై పెప్పర్‌ స్ప్రే చల్లి మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడని పేర్కొన్నారు. బి.ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల దృశ్యాలతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితుడి జాడ గుర్తించారు. కనిగిరిలో అతడిని అదుపులోకి తీసుకుని, చోరీకి గురైన నాలుగు తులాల మంగళసూత్రంతో పాటు ఘటన సమయంలో ఉపయోగించిన ఆయుర్వేద మందుల ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై గతంలోనూ కనిగిరి పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. కొరియర్‌, డెలివరీ ఏజెంట్ల పేరుతో వచ్చే అపరిచితుల వివరాలు నిర్ధారించుకోకుండా తలుపులు తెరవొద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు.