బోనాల పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జగద్గిరిగుట్ట సంజయపురి కాలనీ, అంజయ్య నగర్, సోమయ్య నగర్ ప్రభుత్వ పాఠశాల మరియు ఫతేనగర్లో నిర్వహించిన బోనాల వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, బీజేపీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ గిరివర్ధన్ రెడ్డి గారు, గాజులరామారం మాజీ కార్పొరేటర్ శ్రీ రావుల శేషగిరి గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పలు బోనాల వేడుకల్లో శేఖర్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం పొందారు,
ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
అంజయ్య నగర్లో శ్రీ రమేష్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు, ఫతేనగర్లో శ్రీ మహేందర్ గారి ఆహ్వానం మేరకు బోనాల వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
