వనపర్తి, ఆగస్టు 5 (సిటీటైమ్స్): ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ప్రభుత్వం అందించిన ఉచిత నోట్బుక్కులను బుధవారం ప్రిన్సిపల్ పి.ఆనంద్ పంపిణీ చేశారు. కళాశాలకు మొత్తం 9,792 నోట్బుక్కులు వచ్చాయని, ఒక్కో విద్యార్థినికి 12 చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ కళాశాలల్లో చదివే పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు నోట్బుక్కులను ప్రభుత్వం అందిస్తోందని ఆనంద్ పేర్కొన్నారు. త్వరలో యూనిఫాంలు, షూలు కూడా అందనున్నట్లు తెలిపారు. విద్యార్థినులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు.
కార్యక్రమంలో లైబ్రేరియన్ జి.నర్సింహులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
