శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో జయంతి వేడుకలు
నివాళులర్పించిన జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్
శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (సిటీటైమ్స్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చేసిన మేధోపరమైన పోరాటం చిరస్మరణీయమని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్, ఐఏఎస్ అన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం జోనల్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ అందించిన సిద్ధాంతాలు, చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని నారాయణ్ అమిత్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు.
కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోన్, సర్కిల్ పరిధిలోని అధికారులు, జోనల్ కార్యాలయ సిబ్బంది పాల్గొని జయశంకర్కు నివాళులర్పించారు.
