బ్రేకింగ్ న్యూస్
ప్రజా వీరుడు పండుగ సాయన్నకు ఘన నివాళిబడిలో బోనాల సందడి!మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయంహఫీజ్‌పేటలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’కు సన్నాహాలుమురుగునీటి వివాదం.. ఇరువర్గాలపై కేసులుబ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతిఓఆర్‌ఆర్‌ పక్కన కల్వర్టులో మృతదేహంప్రజా వీరుడు పండుగ సాయన్నకు ఘన నివాళిబడిలో బోనాల సందడి!మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయంహఫీజ్‌పేటలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’కు సన్నాహాలుమురుగునీటి వివాదం.. ఇరువర్గాలపై కేసులుబ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతిఓఆర్‌ఆర్‌ పక్కన కల్వర్టులో మృతదేహం
తెలంగాణ

జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

సీఎంఆర్‌ఎఫ్‌-ఎల్‌ఓసీ మంజూరుపత్రం అందజేసిన పీఏసీ చైర్మన్‌ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి (సిటీటైమ్స్): అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న శేరిలింగంపల్లి డివిజన్‌ పాపిరెడ్డికాలనీకి చెందిన జయలక్ష్మికి రూ.4 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన సీఎంఆర్‌ఎఫ్‌-ఎల్‌ఓసీ మంజూరుపత్రాన్ని పీఏసీ చైర్మన్‌ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. తాజా మాజీ కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆపన్నహస్తంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.