3,200 మందికి అన్నప్రసాద వితరణ.. సేవలోనే సంతృప్తి: చైర్మన్ కొండ విజయ్కుమార్
చందానగర్, ఆగస్టు 8 (సిటీటైమ్స్): హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 196వ అన్నదాన కార్యక్రమాన్ని శనివారం గంగారంలోని ఫౌండేషన్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యులతో కలిసి చైర్మన్ కొండ విజయ్కుమార్ పాల్గొని అన్నప్రసాదాలను వడ్డించారు. సుమారు 3,200 మంది అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా విజయ్కుమార్ మాట్లాడుతూ.. ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆకలితో ఉన్నవారికి కడుపునిండా అన్నం అందించడంలో ఎంతో సంతృప్తి ఉందన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో హోప్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
