కిషోర్ కుటుంబానికి రూ.41 వేల ఆర్థిక సాయం
వనపర్తి, ఆగస్టు 10 (సిటీటైమ్స్): వనపర్తి పట్టణంలోని లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన కిషోర్కుమార్ బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న ‘గర్ల్స్ స్కూల్ వనపర్తి’ 2004 బ్యాచ్ స్నేహితులు మానవతా దృక్పథంతో స్పందించి కిషోర్ కుటుంబానికి అండగా నిలిచారు. కిషోర్ సతీమణి ఉమామహేశ్వరిని పరామర్శించిన స్నేహితులు రూ.41 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆపద సమయంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచి తమ స్నేహబంధంతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టకాలంలో తమకు తోడుగా నిలిచిన 2004 బ్యాచ్ స్నేహితులకు ఉమామహేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 2004 బ్యాచ్ స్నేహితులు విజయలక్ష్మి, స్వప్న, శ్రీదేవి, వనిత, శారద, సిందూరి, రాధ, శ్వేత, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
