బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

కొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!

కొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!

కొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!

ఆగస్టు 15 నుంచి అర్హులకు పంపిణీ

119 నియోజకవర్గాల్లో ఒకేసారి కార్యక్రమం

సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: కొత్త తెల్ల రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక సమాచారం. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులకు కొత్త కార్డులు అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులు అందజేసి పంపిణీని ప్రారంభించనున్నారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో అర్హులకు కార్డులు అందించనున్నారు.

అర్హులైన పేద కుటుంబాలు సంక్షేమ పథకాలకు దూరం కాకుండా కొత్త రేషన్‌ కార్డులు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ కార్డులు అందిస్తామని తెలిపారు. రేషన్‌ కార్డుల ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలతో పాటు నిబంధనల మేరకు వివిధ సంక్షేమ పథకాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.