బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

తెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మా

తెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మా

హఫీజ్‌పేట్‌లో వర్ధంతి సందర్భంగా బీజేపీ నేతల నివాళి

శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (సిటీటైమ్స్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్‌లో మద్దతుగా నిలిచి, తెలంగాణ ప్రజల తరఫున గళమెత్తిన నాయకురాలు సుష్మా స్వరాజ్‌ అని హఫీజ్‌పేట్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్‌ అన్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా గురువారం హుడా కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు సుష్మా స్వరాజ్‌ అండగా నిలిచారని బీజేపీ నాయకులు గుర్తుచేశారు. ఉద్యమంలో యువతకు ధైర్యం చెప్పారని, తెలంగాణతో ఆమెకు ఉన్న అనుబంధంతోనే ప్రజలు ‘తెలంగాణ చిన్నమ్మ’గా ఆదరించారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ అజిత్‌కుమార్‌ సేనాపతి, సీనియర్‌ నాయకుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ రమణయ్య, రవిగౌడ్‌, ఆళ్ల వరప్రసాద్‌, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.