బ్రేకింగ్ న్యూస్
గచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలుదుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహంశాంతినగర్‌లో ఘనంగా బోనాల వేడుకలుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలుదుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహంశాంతినగర్‌లో ఘనంగా బోనాల వేడుకలు
తెలంగాణ

చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

చికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి

రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి.. సికింద్రాబాద్‌ కిమ్స్‌లో తుదిశ్వాస

రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రియాంక స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్పూర్‌. ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన ఆమె రాజమహేంద్రవరంలో పీజీ చదువుతున్నారు. ఈ నెల శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్‌ ఆదిత్య మాల్‌ నుంచి ప్రియాంక తన స్నేహితుడితో కలిసి వాహనంపై వెళ్తుండగా.. దుష్యంత్‌, ఆండ్రూ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వారి వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆమెను సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.