బ్రేకింగ్ న్యూస్
పసిడి భగ్గుమంది!విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు?భౌరంపేట్‌లో రోడ్లు.. డ్రైనేజీ.. ట్రాఫిక్‌పై దృష్టికొరియర్‌ అంటూ ఇంట్లోకి.. పెప్పర్‌ స్ప్రేతో మంగళసూత్రం చోరీ!ఐకియా జంక్షన్‌లో ట్రాఫిక్‌పై నజర్‌నడిగడ్డ తాండలో సమస్యలు పరిష్కరించండిఫైర్‌ ఎన్‌వోసీల్లో ఫోర్జరీ.. హైడ్రా సీరియస్‌ఎస్సీ, ఎస్టీల సంక్షేమం.. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిబాలికల కళాశాలకు 9,792 నోట్‌బుక్కులుపసిడి భగ్గుమంది!విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు?భౌరంపేట్‌లో రోడ్లు.. డ్రైనేజీ.. ట్రాఫిక్‌పై దృష్టికొరియర్‌ అంటూ ఇంట్లోకి.. పెప్పర్‌ స్ప్రేతో మంగళసూత్రం చోరీ!ఐకియా జంక్షన్‌లో ట్రాఫిక్‌పై నజర్‌నడిగడ్డ తాండలో సమస్యలు పరిష్కరించండిఫైర్‌ ఎన్‌వోసీల్లో ఫోర్జరీ.. హైడ్రా సీరియస్‌ఎస్సీ, ఎస్టీల సంక్షేమం.. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిబాలికల కళాశాలకు 9,792 నోట్‌బుక్కులు
జాతీయం

పసిడి భగ్గుమంది!

పసిడి భగ్గుమంది!

10 గ్రాముల మేలిమి బంగారంపై రూ.2,890 పెరుగుదల

22 క్యారెట్ల బంగారం రూ.1.37 లక్షలు దాటింది

కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద కొనసాగింపు

హైదరాబాద్‌: బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.2,890 పెరిగి రూ.1,49,730కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.2,650 ఎగబాకి 10 గ్రాములకు రూ.1,37,250గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పరిణామాలు, ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. తాజా పెరుగుదలతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.50 లక్షల మార్కుకు చేరువైంది.

బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ వెండి ధరలో మాత్రం మార్పు లేదు. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోంది.