• జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసిన సీఎంసీ కమిషనర్ సృజన
సైబరాబాద్, ఆగస్టు 6 (సిటీటైమ్స్): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని గురువారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. సీఎంసీ కమిషనర్ సృజన, ఐఏఎస్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ జీవితాంతం చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆయన ఇచ్చిన సిద్ధాంతపరమైన బలం, ఉద్యమానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.కార్యక్రమంలో సీఎంసీ వివిధ విభాగాల అధిపతులు, అధికారులు పాల్గొన్నారు.
