బ్రేకింగ్ న్యూస్
బోనమెత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుఅన్నకు రాఖీ.. ఆత్మీయతకు ప్రతీక!చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగబోనమెత్తిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుఅన్నకు రాఖీ.. ఆత్మీయతకు ప్రతీక!చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగ
తెలంగాణ

అన్నకు రాఖీ.. ఆత్మీయతకు ప్రతీక!

అన్నకు రాఖీ.. ఆత్మీయతకు ప్రతీక!

 

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన ఎంపీ కావ్య

పరకాల, ఆగస్టు 16(సిటీ టైమ్స్): పరకాలలో నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భారీ బహిరంగ సభలో అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధం వెల్లివిరిసింది. రక్షాబంధన్‌ సందర్భంగా వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యురాలు డాక్టర్‌ కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సభా ప్రాంగణంలో చోటుచేసుకున్న ఈ ఆత్మీయ ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

రాఖీ కట్టిన అనంతరం ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం సీఎం చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనకు అన్నగా అండగా నిలుస్తూ వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రంగాల్లో సహకరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

 

రక్షాబంధన్‌ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనలో ఉండనున్న నేపథ్యంలో పరకాల సభా వేదికగా ఎంపీ కడియం కావ్య ముందుగానే రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కడుతున్న దృశ్యాన్ని చూసిన సభకు హాజరైన ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

 

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచిన ఈ ఆత్మీయ ఘట్టం పరకాల సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.