బ్రేకింగ్ న్యూస్
స్కూల్‌లో ఉండాల్సిన బిడ్డ.. చెరువులో ఎలా?తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళితెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుస్కూల్‌లో ఉండాల్సిన బిడ్డ.. చెరువులో ఎలా?తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళితెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు
తెలంగాణ

తెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయం

తెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయం

సైబరాబాద్‌ కమిషనరేట్‌లో జయంతి సందర్భంగా నివాళులు

సైబరాబాద్, ఆగస్టు 6 (సిటీటైమ్స్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ జీవితాంతం చేసిన కృషి చిరస్మరణీయమని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.రమేష్‌, ఐపీఎస్‌ అన్నారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా గురువారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్‌ చేసిన కృషి, ఆయన సిద్ధాంతాలు, ప్రజల పట్ల చూపిన అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని సీపీ పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో అడ్మిన్‌ డీసీపీ అన్నపూర్ణ, క్రైమ్స్‌ డీసీపీ ముత్యంరెడ్డి, సీఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌ డీసీపీ సంజీవ్‌తో పాటు ఇతర పోలీసు అధికారులు పాల్గొని నివాళులర్పించారు.