Breaking News

హైడ్రా హోంగార్డును బలి తీసుకుందనడం సరికాదు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్:సెప్టెంబర్ 30, సిటీ టైమ్స్ :ఇటీవల సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఆ సమయంలో ఓ హోంగార్డు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు..
అయితే హోంగార్డును హైడ్రా బలి తీసుకుందని సోషల్ మీడియాలు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. కూల్చివేతలన్నీంటికి హైడ్రా కు ముడి పెట్టవద్దని మీడియా తెలిపారు.
సంగారెడ్డి, మల్కాపూర్ చెరువుతో హైడ్రాకు ఎలాం టి సంబంధం లేదన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని పేరుకొన్నారు.సంగారెడ్డిలో హోం గార్డు గాయపడి మరణిస్తే హైడ్రా బలి తీసుకుందని చెప్పడం సరికాదని అన్నారు. అనవసరంగా హైడ్రా పై అసత్య ప్రచారాలు చేస్తే న్యాయపరణంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మూసీ న‌దికి ఇరువైపులా స‌ర్వేల‌తో హైడ్రాకు సంబంధం లేదు.
అక్క‌డి నివాసితుల‌ను హైడ్రా త‌ర‌లించ‌డంలేదని,అక్క‌డ ఎలాంటి కూల్చివేత‌లు హైడ్రా చేప‌ట్ట‌డంలేదఅని చెప్పారు.
మూసీ ప‌రీవాహ‌క ప్రాంతంలోని ఇళ్ల‌పై హైడ్రా మార్కింగ్ చేయ‌డంలేదని, మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్ర‌త్యేక ప్రాజెక్టు కావడంతో దీనిని మూసి రివ‌ర్‌ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చేప‌డుతుందని అన్నారు.