బ్రేకింగ్ న్యూస్
ప్రజా వీరుడు పండుగ సాయన్నకు ఘన నివాళిబడిలో బోనాల సందడి!మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయంహఫీజ్‌పేటలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’కు సన్నాహాలుమురుగునీటి వివాదం.. ఇరువర్గాలపై కేసులుబ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతిఓఆర్‌ఆర్‌ పక్కన కల్వర్టులో మృతదేహంప్రజా వీరుడు పండుగ సాయన్నకు ఘన నివాళిబడిలో బోనాల సందడి!మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం!కొత్త పింఛన్లకు దరఖాస్తులు షురూ!196వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన హోప్‌ ఫౌండేషన్‌జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయంహఫీజ్‌పేటలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’కు సన్నాహాలుమురుగునీటి వివాదం.. ఇరువర్గాలపై కేసులుబ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతిఓఆర్‌ఆర్‌ పక్కన కల్వర్టులో మృతదేహం
తెలంగాణ

బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన తవేరా

శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై తవేరా కారు అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి 12.25 గంటల సమయంలో డంపింగ్‌ యార్డ్‌, నియో పోలీస్‌ బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పోలీస్ ల వివరం ప్రకారం.. కొల్లూరులోని ఇంద్రారెడ్డినగర్‌లో నివసించే కనైయాలాల్‌ (25), దేరామ్‌ (24) టైల్స్‌ పనులు చేస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన వీరిద్దరూ ఇంద్రారెడ్డినగర్‌ నుంచి నానక్‌రామ్‌గూడలోని సత్వాకు ఏపీ01ఏబీ2232 నంబరు తవేరా కారులో బయలుదేరారు. కారును కనైయాలాల్‌ నడుపుతున్నాడు.

డంపింగ్‌ యార్డ్‌ సమీపంలోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై కారు అతివేగంగా వెళ్తుండగా అదుపుతప్పి నియో పోలీస్‌ బ్రిడ్జి పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనైయాలాల్‌, దేరామ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఇతర వాహనం ప్రమేయం లేకుండా జరిగిన స్వయం ప్రమాదంగా పోలీసులు పేర్కొన్నారు.