ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన తవేరా
శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై తవేరా కారు అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి 12.25 గంటల సమయంలో డంపింగ్ యార్డ్, నియో పోలీస్ బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
పోలీస్ ల వివరం ప్రకారం.. కొల్లూరులోని ఇంద్రారెడ్డినగర్లో నివసించే కనైయాలాల్ (25), దేరామ్ (24) టైల్స్ పనులు చేస్తుంటారు. రాజస్థాన్కు చెందిన వీరిద్దరూ ఇంద్రారెడ్డినగర్ నుంచి నానక్రామ్గూడలోని సత్వాకు ఏపీ01ఏబీ2232 నంబరు తవేరా కారులో బయలుదేరారు. కారును కనైయాలాల్ నడుపుతున్నాడు.
డంపింగ్ యార్డ్ సమీపంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు అతివేగంగా వెళ్తుండగా అదుపుతప్పి నియో పోలీస్ బ్రిడ్జి పిల్లర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనైయాలాల్, దేరామ్ అక్కడికక్కడే మృతిచెందారు. ఇతర వాహనం ప్రమేయం లేకుండా జరిగిన స్వయం ప్రమాదంగా పోలీసులు పేర్కొన్నారు.
