హైదరాబాద్, అక్టోబర్ 30, సిటీ టైమ్స్ : స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 పురస్కరించుకుని, నగరంలో గార్బేజ్ వాల్నారేబుల్ పాయింట్ ను తొలగించి ప్రాంతాలను శుభ్రం చేసి, అక్కడ దీపావళి శుభాకాంక్షలతో బ్యానర్లు, వాల్ రైటింగ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో మహిళలు ముగ్గులు వేశారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్తను అక్కడ వేయకుండా ఉండేందుకు శానిటేషన్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.
