నగర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు: జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 30, సిటీ టైమ్స్ : దీపావళి పండుగ సందర్భంగా నగర ప్రజలకు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ చెడు మీద మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుందన్నారు.ఈ పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అష్ట ఐశ్వర్యాలు, సకల శుభాలను, ధైర్య, స్థైర్య విజయాలను, సిరిసంపదలను, సుఖ సంతోషాలను ఎల్లవేళలా ప్రసాదించాలని ఆమె కోరారు. ప్రజలు పండుగను సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలన్నారు. ప్రకృతి, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ కాలుష్య రహితంగా పండుగ జరుపుకోవాలని ఆమె విజ్ఞప్తి చేసారు.