Breaking News

అక్రమ కేసులు తో బిసి ఉద్యమాన్ని ఆపలేరు:కాసోజు బ్రహ్మచారి

  • .తీన్మార్ మల్లన్న పై రెడ్డి జాగృతి అక్రమ కేసును వెంటనే తొలగించాలి

.పాలకుర్తి:, సెప్టెంబర్ 29, (సిటీ టైమ్స్).ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రం లో,బిసి ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని నిత్యం క్యూ న్యూస్ వేదికగా ప్రజలను చైతన్య పరుస్తున్న తీన్మార్ మల్లన్న పై రెడ్డి జాగృతి సంఘం వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని తీన్మార్ మల్లన్న టీం జనగామ జిల్లా కో కన్వీనర్ ,కాసోజు బ్రహ్మచారి అన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ…. తీన్మార్ మల్లన్న ప్రజల గొంతుక బీసీలు అన్ని రంగాలలో వెనుకబాటుకు గురవుతున్నారు అని అభివృద్ధికి ఆమడ దూరంలో అగ్రకులాలను నెట్టి వేయబడుతున్నాయని, విద్య వైద్యం, రాజకీయ సామాజిక న్యాయ అన్ని రంగాలలో బీసీలకు అన్యాయం, జరుగుతుంటే బీసీ సమాజాన్ని మేల్కొలిపే ప్రయత్నాలు చేస్తుంటే అది చూసి ఓర్వలేక బీసీ ఉద్యమాన్ని ఎలాగైనా నీరు కార్చాలని, కుట్ర పన్ని రెడ్డి జాగృతి సంఘం కి సంబంధించిన వ్యక్తులు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సిగ్గుచేటు అని, తీన్మార్ మల్లన్న పై అనేక రకాలుగా, బెదిరింపులు దాడులు అక్రమ కేసులు , జైల్లో నిర్బంధించినప్పుడే ,ఎవరికీ భయపడలేదు తలవంచలేదు, మీరు ఇప్పుడు తీన్మార్ మల్లన్న పై పెట్టిన కేసులు కొత్త ఏమి కాదు, బిసి, ఎస్సీ, ఎస్టి సమాజం చైతన్యానికి పత్రిక, మళ్ళీ ఇలాంటి ఆరోపణలు చేస్తే తీన్మార్ మల్లన్న టీం ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు